30, ఆగస్టు 2011, మంగళవారం

వినాయక చవితి నాడు వాడవలసిన పత్రి ఏది?

వినాయక చవితి అంటే ఎంతో సరదా చిన్నప్పటి నుంచి. పొద్దున్నే ఇంటి ఆవరణలో ఉన్న చెట్ల ఆకులను "పత్రి" పూజ కోసం కోసుకొస్తాం. అసలు పత్రి అంటేనే ఆకులు.అయితే ఏ ఆకులు దొరికితే వాటిని కోసుకోస్తాం. అందులో దూర్వాలు మాత్రం మరచిపోకండర్రా" అని అమ్మ చెప్పితే ముందు ఈ దూర్వాలంటే ఏమిటో తెలిసేది కాదు. "గడ్డి పరకలు" అనగానే "ఓస్! ఇంతేనా" అని అనుకుంటాం. "దూర్వా యుగ్మం" అంటే జంటగా ఉండే గరిక లేదా దర్భలు అంటే వినాయకునికి ప్రీతి.  అయితే, ఒక్క వినాయకుడికే ఈ పత్రి పూజ ఎందుకు చేస్తాం?  ఏయే ఆకులను పత్రిగా ఉపయోగిస్తారు?

      వినాయకుడు గజ ముఖుడు కదా! ఏనుగుకు ఇష్టమైనవి ఆకులు, కనుక పత్రి పూజ చేస్తాం. గణేశునికి "ఏక వింశతి" అంటే 21 రకాల పత్రితో పూజిస్తాము. అందులో తులసి ఆకులు కూడా వాడతాము. సాధారణం గా తులసి మాలలను శ్రీ కృష్ణునికి తప్ప మరెవరికి పూజలో ఉపయోగించము. ఈ ఇరవై ముఖ్యమైన పత్రి కాకుండా చాల రకాల పత్రిని వినాయకుని పూజలో వాడతాము. అయితే మనం నివసించే ప్రదేశాలలో పెరిగే చెట్లను బట్టి ఈ ఇరవై ఒక్క రకాలలో కొన్ని మార్పులు చేస్తుంటాం. ఉదాహరణకు నేరేడు, వెలగ వంటి పత్రి, వాటి పండ్లు అంటే వినాయకునికి ప్రీతి.  అయితే విషపూరితమైన మొక్కలను పిల్లలు తాకకుండా పెద్ద వాళ్ళు జాగ్రత్త పడాలి. అయితే ఈ ఇరవై ఒక్క రకాల పత్రిని ఎలా గుర్తు పడతాము? అందుకు వీలుగా ఈ దిగువన ఆయా ఆకుల బొమ్మలు పొందు పరచాను. 
 
"ఏక వింశతి పత్రి పూజ"
1. మాచీ పత్రం (మాచి పత్రి)
 2. బృహతీ పత్రం (వాకుడు)
 3. బిల్వ పత్రం (మారేడు)
4. దూర్వాలు (గరిక)
 5. దత్తూర పత్రం (ఉమ్మెత్త)
 6. బదరీ పత్రం (రేగు)
 7. అపామార్గ పత్రం (ఉత్తరేణి)
 8. తులసీ పత్రం (తులసి)
 9. చూత పత్రం (మామిడి)
 10. కరవీర పత్రం (గన్నేరు)

11. విష్ణుక్రాంత పత్రం (విష్ణుకాంత)
 12. దాడిమీ పత్రం (దానిమ్మ)
 13. దేవదారు పత్రం
14. మరువక పత్రం (మరువం)
 15. సింధువార పత్రం (వావిలి)
 16. జాజీ పత్రం (జాజి)
17. గండకీ పత్రం (దేవకాంచనం)
 18. శమీ పత్రం (జమ్మి)
 19. అశ్వత్థ పత్రం (రావి)
 20. అర్జున పత్రం (మద్ది)
 21. ఆర్క పత్రం (జిల్లేడు)

గణేశుని  పూజ చేసేటప్పుడు ఒక్కొక్క నామం చదువుతూ ఆయా పత్రిని సమర్పిస్తాము. ఆయా ఆకుల సంస్కృతము మరియు తెలుగు పేర్లు దిగువ పట్టికలో చూడగలరు.

సం. వినాయకుని నామము  పత్రి పూజయామి తెలుగు పేరు 
1. ఓం సుముఖాయ నమః మాచీ పత్రం పూజయామి మాచిపత్రి
2. ఓం గణాధిపాయ నమః బృహతీ పత్రం పూజయామి వాకుడు
3. ఓం ఉమాపుత్రాయ నమః బిల్వ పత్రం పూజయామి మారేడు
4. ఓం గజాననాయ నమః దూర్వాయుగ్మం పూజయామి గరిక 
5. ఓం హరసూనవే నమః దత్తూర పత్రం పూజయామి ఉమ్మెత్త
6. ఓం లంబోదరాయ నమః బదరీ పత్రం పూజయామి రేగు 
7. ఓం గుహాగ్రజాయ నమః ఆపామార్గ పత్రం పూజయామి ఉత్తరేణి
8. ఓం గజకర్ణాయ నమః తులసీ పత్రం పూజయామి తులసి
9. ఓం ఏకదంతాయ నమః చూత పత్రం పూజయామి మామిడి
10. ఓం వికటాయ నమః కరవీర పత్రం పూజయామి ఎర్ర గన్నేరు
11. ఓం భిన్నదంతాయ నమః విష్ణుక్రాంత పత్రం పూజయామి విష్ణుకాంత
12. ఓం వటవే నమః దాడిమీ పత్రం పూజయామి దానిమ్మ
13. ఓం సర్వేశ్వరాయ నమః దేవదారు పత్రం పూజయామి దేవదారు
14. ఓం ఫాలచంద్రాయ నమః మరువక పత్రం పూజయామి మరువం
15. ఓం హేరంబాయ నమః సింధువార పత్రం పూజయామి వావిలి
16. ఓం శూర్పకర్ణాయ నమః జాజీ పత్రం పూజయామి జాజి
17. ఓం సురాగ్రజాయ నమః గండకీ పత్రం పూజయామి దేవకాంచనం
18. ఓం ఇభ వక్త్రాయ నమః శమీ పత్రం పూజయామి జమ్మి 
19. ఓం వినాయకాయ నమః అశ్వత్థ పత్రం పూజయామి రావి
20. ఓం సురసేవితాయ నమః అర్జున పత్రం పూజయామి తెల్ల మద్ది
21. ఓం కపిలాయ నమః ఆర్క పత్రం పూజయామి జిల్లేడు

 పత్రి పూజ వలన ప్రయోజనం ఏమిటి?
      వినాయకుని పూజలో ఉపయోగించే రకరకాల ఆకులలో చాల విశేషమైన ఔషధ గుణాలున్నాయి. అవి నేత్ర సంబంధమైన, మూత్ర సంబంధమైన వ్యాధులకు, చర్మ రోగాలకు, మరి కొన్ని ఇతర వ్యాధులకు మంచి మందుగా పని చేస్తాయి. అంటే కాక ఆ పత్రి నుండి వెలువడే సుగంధాన్ని పీల్చడం ద్వారా కూడా స్వస్థత చేకూరుతుంది. ఈ పత్రిలో గల వృక్ష సంబంధమైన రసాయన పదార్థాలు (phytochemicals), పత్రిని మనం చేతితో ముట్టుకోవడం వలన కావలసిన మోతాదులో చర్మం ద్వారా మన శరీరం లోకి శోషణం (absorb) చెంది ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. వినాయకుని పూజ వలన మనకు విఘ్నాలు తొలగి అనుకున్న పనులన్నీ చక్కగా జరుగుతాయి. పిల్లలకు పత్రి సేకరణ వలన విజ్ఞానము, వినోదము, పర్యావరణ పట్ల స్నేహ భావము కలుగుతాయి. అందుకే వినాయకుని పూజ అంటే అందరికీ ఇష్టం.
 శ్రీ గణేష్ మహారాజ్ కి జై!

29, ఆగస్టు 2011, సోమవారం

శ్రీ జగన్నాథ అష్టకం రచించినది ఎవరు?

బలభద్రుడు, సుభద్ర, జగన్నాథుడు
పూరీ జగన్నాథస్వామి క్షేత్రం ప్రత్యేకత ఏమిటంటే మిగిలిన వైష్ణవ క్షేత్రాలలో మాదిరిగా కాక, ఇక్కడ తోబుట్టువులు దేవుళ్ళుగా వెలశారు. వీరే జగన్నాథుడు, బలభద్రుడు, మరియు సుభద్ర. స్థానికులు "జగన్నాథో! బొలభోద్రో! సుభొద్రో!" అని ఎలుగెత్తి పిలుస్తారు.  ఒక విశేషం ఏమిటంటే,  శ్రీ జగన్నాథునికి ఎన్ని భోగాలు వున్నా, లేకున్నా తవిటి రొట్టె (తవుడుతో చేసిన రొట్టె) భోగం తప్పని సరిగా వుండాలి. పూరీ జగన్నాథ స్వామిపై ప్రసిద్ధమైన "జగన్నాథ అష్టకం" వుంది. ఇది "కదాచిత్ కాళిందీ తట విపిన సంగీతక వరో..అని ప్రారంభమై ప్రతి నాలుగవ పాదం "జగన్నాథ స్వామీ నయన పథగామీ భవతు మే" అని పూర్తవుతుంది. అయితే ఈ అష్టకం శ్రీ ఆది శంకరాచార్యుల వారు రచించారని పలు వెబ్ సైట్లలో కనిపిస్తుంది. కాని అది ఎంత వరకు వాస్తవం? ఇందులో శ్రీ శంకరాచారుల వారిని కించ పరచే ఉద్దేశ్యం ఎ మాత్రం లేదని చదువరులకు మనవి.  శ్రీ ఆది శంకరులు మనకు ఎన్నో మధురమైన స్తోత్రాలు, అష్టకాలు అందించారు, ఎన్నో భాష్యాలు వ్రాసారు. 

అసలు రచయిత:
అయితే ఈ జగన్నాథ అష్టకం రచించినది కీ.శే. శ్రీ నడిమింటి సర్వమంగళేశ్వర శాస్త్రి గారు (1759-1830). వీరు ప్రస్తుత విజయనగరం జిల్లాలోని పార్వతీపురం పట్టణం దగ్గర గల నాగూరు అగ్రహారమునకు చెందిన వారు. "అభినవ కాళిదాసు" అని బిరుదు పొందిన శాస్త్రి గారు "సమాస కుసుమావళి", "శబ్ద మంజరి", "రామాయణ సంగ్రహము", "విభక్తి విలాసము" అను ప్రముఖ రచనలు చేసారు.  శ్రీ సర్వ మంగళేశ్వర శాస్త్రి గారు మా మాతామహులైన కీ.శే. శ్రీ నడిమింటి పతంజలి శాస్త్రి (1906 - 1972) గారికి స్వయాన ముత్తాత గారు.  

పొరపాటుకు కారణం:
అయితే రచయిత విషయంలో జరిగిన ఈ పొరపాటుకు మొదటి కారణం "వావిళ్ళ ప్రెస్" వాళ్ళు తమ "బృహస్తోత్ర రత్నాకరం" లో ఈ అష్టకం రచయిత శ్రీ ఆది శంకరాచార్యుల వారు అని మరల మరల ముద్రించడం. ఒక పర్యాయం మా తాత గారైన కీ.శే. శ్రీ నడిమింటి పతంజలి శాస్త్రి గారు ఈ పొరపాటును వావిళ్ళ వారి దృష్టికి తీసుకు రాగా, సదరు ప్రెస్సు వాళ్ళు తప్పు సరిదిద్దడం అటుంచి, అసలు రచయిత పేరు లేకుండా ముద్రించడం మొదలు పెట్టారు. అంతేకాదు ఒడిస్సా (ఒరిస్సా) రాష్ట్రానికి సంబంధించిన వెబ్ సైట్లలో సైతం జగన్నాథ అష్టకం "శ్రీ శంకరాచార్యుల విరచితం" అని ప్రచురించారు. దీనిని అంతర్జాలంలోని పలు వెబ్ సైట్లు వారు ఈ తప్పునే ఒప్పుగా ప్రచురించారు/ప్రచురిస్తున్నారు.
 

పరిశోధన - జువులు:
(1) మా మేనమామ గారైన ఆచార్య నడిమింటి శ్రీ రామచంద్ర శాస్త్రి గారు (విశాఖ పట్టణం వాస్తవ్యులు)  ఈ విషయము మీద పరిశోధన చేసి కొంత సమాచారం సేకరించారు. వారు (శ్రీ నడిమింటి శ్రీరామచంద్ర శాస్త్రి గారు)  ఇటీవల డిసెంబరు 23, 2010 న సకుటుంబ సమేతంగా శృంగేరి లోని శారదా పీఠం లోని ప్రస్తుత శ్రీ శంకరాచార్యులు శ్రీ శ్రీ శ్రీ భారతీ తీర్థ స్వామి వారిని సందర్శించి, శ్రీ సర్వ మంగళేశ్వర శాస్త్రి గారు తన "ప్ర-ప్ర-పితామహులు" అని చెప్పగా, వెంటనే శ్రీ ఆచార్యుల వారు "సమాస కుసుమావళి" లోని శ్లోకాలు అనర్గళంగా చెప్పడం మొదలు పెట్టారట. ఈ అష్టకమే కాక, శ్రీ సర్వ మంగళేశ్వర శాస్త్రి గారి ఇతర రచనలను కొందరు ప్రకాశకులు (publishers) వేరే రచయితల పేర్లతో పేర్కొనడం శ్రీ భారతీ తీర్థ స్వామి వారి దృష్టికి తీసుకు రాగా, శ్రీ ఆచార్యుల వారు ఈ రచనలు శ్రీ సర్వ మంగళేశ్వర శాస్త్రి గారివేనని ద్రువీకరించారట. 

(2) మరొక నిరూపణ లేక నిర్ధారణ ఏమిటంటే, శ్రీ ఆదిశంకరులు జన్మించిన కాలడి (కేరళ) లో గల "శ్రీ శంకరాచార్య సంస్కృత విశ్వవిద్యాలయం" వారు కూడ, శ్రీ ఆది శంకరాచార్యుల 'సర్వరచనల సంకలనాల'లో కూడా "జగన్నాథ అష్టకం" లేదని దృవ పరిచారట.  

(3) ఇది అంతర్జాల యుగం. ప్రస్తుతం ఉన్న దాదాపు అన్ని వెబ్ సైట్లలోనూ జగన్నాథ అష్టకం శ్రీ శంకరాచార్య విరచితం అని వుంటుంది. అయితే ఒకే ఒక వెబ్ సైట్ మాత్రం ఈ అష్టక రచయిత పేరు సరిగ్గా సూచిస్తుంది. అది -

(4) అంతేకాక అనేకానేక ఆధ్యాత్మిక గ్రంథాలను దశాబ్దాలుగా సేవాదృష్టితో సరసధర ప్రతులుగా ప్రచురించుతూ ఉండిన స్వర్గీయ శ్రీ పురిపండా రాధాకృష్ణ మూర్తి గారు కూడా తమ "శ్రీ కృష్ణ స్తోత్ర రత్నములు" మొదలగు గ్రంథములలో శ్రీ జగన్నాథాష్టకము శ్రీ నడిమింటి సర్వమంగళ శాస్త్రి విరచితమని స్పష్టముగా ప్రచురించినారు.

(5) ఇవికాక, 1937  లో ప్రచురించబడిన మహాకవి శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి "చాటుపద్య మణిమంజరి" అన్న గ్రంథము లోనూ, 1972 లో 'స్వాతి' దీపావళి ప్రత్యెక సంచికలో దేవీ భాగవతం మొదలగునవి రచించిన ప్రముఖ ఆధ్యాత్మిక గ్రంథ రచయిత శ్రీ యామిజాల పద్మనాభ స్వామి గారు, "వాగ్మి శ్రీ సర్వ మంగళేశ్వర శాస్త్రి" అన్న తమ వ్యాసం లోనూ శ్రీ జగన్నాథాష్టకము నడిమింటి వారిదని వ్రాసినారు. యామిజాల వారై తే శ్రీ సర్వ మంగళేశ్వర శాస్త్రి గారిని ఏ పరిస్థితులు శ్రీ జగన్నాథాష్టకము ఆశువుగా చెప్పారో కూడా ప్రస్తావించారు.

జగన్నాథ అష్టకం వ్రాసిన వైనం:
ఒక తూరి శాస్త్రి గారిపై అసూయతో, అవమానింపదలచిన కొందరు, అశుభ్రంగా మురికి బట్టలతో ఉన్న ఒకనిచే ఎంగిలి చిప్పలో జగన్నాథ స్వామి వారి ప్రసాదం పంపేరు. దానిని నిరాకరించిన శాస్త్రి గారికి ప్రసాద దూషణ కారణంగా కన్నులు పోయినవి. అప్పుడు శాస్త్రి గారు శ్రీ జగన్నాథ స్వామి పై ఆశువుగా  "నయనపగామీ భవతుమే" (నా కన్నులకు మార్గము / దృష్టి ఇమ్ము) అన్న మకుటంతో అష్టకం చెప్పి వేడుకున్నారు.  ప్రసన్నులైన శ్రీ జగన్నాథస్వామి దృష్టి నివ్వగా శ్రీ శాస్త్రి గారు, "ప్రభూ నేను తమ ప్రసాద దూషణ చేసినందుకు తమరు విధించిన శిక్షకు పాత్రునే. కాన నా ఒక కన్ను తీసుకో స్వామీ. కాని నీ చక్కని రెండు కనులతో అందరినీ కృపా దృష్టితో చూడు" అన్నారు. 'దేవునితోనే చతుర చమత్కారము సేయగల మహా "వాగ్మి" శ్రీ సర్వమంగళేస్వర శాస్త్రి గారు' అని యామిజాల వారు వ్రాసారు. కాగా తమ జీవిత ద్వితీయార్థంలో శ్రీ సర్వమంగళేస్వర శాస్త్రి గారు ఒక కన్నుతో ఉండే వారన్నది చరిత్ర.

(6) ఈ విషయం సుమారు 1650 నుండి తెలిసిన "శ్రీ నాగూరి నడిమింటి వారి వంశ చరిత్ర" ద్వారా కూడా తెలియును.
 
ఈ సందర్భములో గమనించవలసిన విషయము ఒకటున్నది.  శ్రీ సర్వమంగళేశ్వర శాస్త్రి గారు ఓడిశా రాష్ట్ర సరిహద్దులోగల ఉత్తరాంధ్ర జిల్లా అయిన నాటి విజాగపటం జిల్లా వాసి. పూరీ క్షేత్రంలో వారిని "దక్షిణ శాస్త్రి" అనేవారు. ఉత్తరాంధ్రకు దూరమైన ప్రాంతాల వారికి తగు సంచార సాధనాలులేని నాటి రోజులలో  సర్వమంగళేశ్వరుల గురించి తెలియకుండేది. ఇంకా ఎందరెందరో స్తోత్రకారులు తమ తమ రచనలు ప్రాచుర్యం పొందాలనే ఉద్దేశ్యంతో శ్రీ శంకరాచార్యులు మరియు ఇతర మహానుభావులు పేరుమీద విడుదల చేసేవారని పండితులు అంటారు. మరియు ఒకే దేవుడు లేదా దేవత పై ఒకరి కంటే ఎక్కువ కవులు స్తోత్రాలు వ్రాసారు. ఉదాహరణకు మాకు తెలిసి సూర్యదేవునిపై  సర్వమంగళేశ్వరుల రచనతో కలిపి మూడు స్తోత్రాలునాయి. గణపతిపై అరడజను స్తోత్రాలున్నాయి.

సారాంశము:
అందువలన, పైన పేర్కొన్న వివరణలతో, ఆధారాలతో సవినయంగా, 'కదాచిత్ కాళిందీ తట..' అన్న శ్రీ జగన్నాథ అష్టకం శ్రీ సర్వమంగళేశ్వర శాస్త్రి  కృతమని విన్నవించడమైనది. 

YSµm¸ék¸¶¨àOµA- §ñ ¶mfº£ÀAdº ¶ª±µö¶¢ÀASµyɶ¥ö±µ ¥¹»ªåò £±µWhµ¶¢ÀÀ
Oµl¸Wh³ O¸zAl¿ hµd £»p¶m ¶ªAS¿hµOµ ¶¢±Ð
¶¢ÀÀl¸ Sоp m¸±¿ ¶¢lµ¶m Oµ¶¢Àv¹«¸ölµ ¶¢ÀlûµÀ¶pB |
±µ¶¢Ã ¶¥AsûµÀ sñ¶®î¶¢À±µ¶pi SµgÉ¥¹±¼Ûhµ ¶plÐ
YSµm¸ékµ «¸ö¤À ¶m±ÀµÀ¶m ¶pkµS¸¤À sûµ¶¢hµÀÊ¢À || 1 ||

sûµYÉ ¶ªÊ¢ï Ê¢gÀ´¢À ¦±µ»ª ¦Q»pAVµA Oµdº hµdÉ
lµÀOµÃv´¢À Êmh¸ñÊmå ¶ª¶¬Vµ±µ Oµd¹°µA £lûµlµhÉ |
¶ªl¸ §ñ ¶¢ÀlµìýÅAl¸¶¢¶m ¶¢¶ªi xv¹ ¶p±¼Vµ±ÀÇÃ
YSµm¸ékµ «¸ö¤À ¶m±ÀµÀ¶m ¶pkµS¸¤À sûµ¶¢hµÀÊ¢À || 2 ||

¶¢À¶®AsûÑlɾªå±É Oµ¶mOµ ±µÀW±É ov ¦P±É
¶¢¶ªh³ q¸ñ«¸l¸¶m嶪ù¶¬Y svsûµlÉñg swm¸ |
¶ªÀsûµl¸ñ ¶¢Àlûµï¶ªæ¶ªùOµv ¶ªÀ±µÊª¢¸¶¢¶ª±µlÐ
YSµm¸ékµ «¸ö¤À ¶m±ÀµÀ¶m ¶pkµS¸¤À sûµ¶¢hµÀÊ¢À || 3 ||

Oµk¸ q¸±¸¢¸±¸¶ªùYv YvlµÊ¥ñgº ±µÀW±Ð
±µ¶¢Ã ¢¸g½ «Õ¶¢À ¶ªÀë±µlµ¶¢Àv ¶plÐîlµí¶¢ ¶¢ÀÀËPÇB |
¶ªÀ±ÉAËlÇþñ±¸±¸lûµïB ¶¥ÀñiSµg¦P¹ S¿hµVµ±¼hÐ
YSµm¸ékµ «¸ö¤À ¶m±ÀµÀ¶m ¶pkµS¸¤À sûµ¶¢hµÀÊ¢À || 4 ||

±µk¸±µÃfûÐ SµVµÜ¶mêk¼£Àzhµ sûµÃlɶ¢ ¶pdËvÇB
¶ªÀåi q¸ñlµÀ±¸í¶¢A ¶pñi ¶¢ÀÀq¸Oµ±µäþï ¶ªlµ±ÀµÀB |
lµ±ÀµÃ »ªAlûµÀ±¸í¶mÀ¶ªùOµv YSµh¸A »ªAlûµÀ ¶ªÀhµ±ÀµÃ
YSµm¸ékµ «¸ö¤À ¶m±ÀµÀ¶m ¶pkµS¸¤À sûµ¶¢hµÀÊ¢À || 5 ||

¶p±µsñ¶®î ¾pfµB OµÀ¶¢v±ÀµÀ lµyÑhµÀëvô ¶m±ÀµÀmÐ
n¢¸¾ª ov¹lÓñ n»¬hµ Vµ±µgÑ„¶m¶må ¦±µ»ª |
±µ«¸¶mmÐç ±¸lû¸ ¶ª±µ¶ª ¶¢¶pÁ±¸wASµ¶m ¶ªÀPÑ
YSµm¸ékµ «¸ö¤À ¶m±ÀµÀ¶m ¶pkµS¸¤À sûµ¶¢hµÀÊ¢À || 6 ||

¶m ËÈ¢ q¸ñ±µæþïA ±¸YïA ¶m Vµ Oµ¶mOµh¸A sûÑSµ £sûµ¶¢A
¶m ±ÀµÃVÉ„¶¬A ±µ¶¢ÃïA nQvY¶m O¸¶¢ÃïA ¶¢±µ¶¢lûµÃA |
¶ªl¸ O¸vÉ O¸vÉ ¶pñ¶¢Àkµ ¶pim¸ S¿hµVµ±¼hÐ
YSµm¸ékµ «¸ö¤À ¶m±ÀµÀ¶m ¶pkµS¸¤À sûµ¶¢hµÀÊ¢À || 7 ||

¶¬±µ hµöA ¶ªA«¸±µA lµÀñhµhµ±µ ¶¢À¥¹±µA ¶ªÀ±µ¶phÉ
¶¬±µ hµöA q¸q¸m¸A £hµhµ¶¢À¶p±¸A ±ÀµÃlµ¶¢¶phÉ |
C¶¬Ñ l¿m¸m¸kµA n»¬hµ¶¢ÀVµvA n¦Ûhµ¶plµA
YSµm¸ékµ «¸ö¤À ¶m±ÀµÀ¶m ¶pkµS¸¤À sûµ¶¢hµÀÊ¢À || 8 ||

 సర్వేజనాః సుఖినో భవంతు.

20, ఆగస్టు 2011, శనివారం

అందరికీ శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు


వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం 
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం 

ప్రతి పదార్థము: వసుదేవ = వసుదేవుడు (శ్రీ కృష్ణుని తండ్రి); సుతం = కొడుకు; కంస = కంసుడు (కృష్ణుని మేనమామ); చాణూర = చాణూరుడు (కంసుని ఆస్థాన మల్లయోధుడు); మర్దనం = చంపిన వాడు; దేవకీ = కృష్ణుని తల్లి అయిన దేవకీ దేవి; పరమ = మిక్కిలి; ఆనందం = సంతోషం; కృష్ణం = కృష్ణుని; వందే = నమస్కరింతును; జగత్ = ప్రపంచము; గురుం = గురువుని.

తాత్పర్యం: వాసుదేవుని కొడుకైన, తల్లియైన దేవకీ దేవికి మిక్కిలి ఆనందమును కలిగించిన, కంసుడు, చాణూరుడు వంటి దుష్టులను మట్టుబెట్టినట్టి, జగత్గురువైనట్టి శ్రీకృష్ణుని నమస్కరింతును.


అందరికీ శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు 

12, ఆగస్టు 2011, శుక్రవారం

నూతన యజ్ఞోపవీత ధారణా విధానము


జంధ్యాల పౌర్ణమి నాడు మా తాతగారి పుట్టిన రోజు. అందువలన నాకు బాగా గుర్తు. నా చిన్నప్పుడు మా నాన్న, తాతగారితో బాటు పొద్దున్నే నిద్ర లేచి స్నానం చేసి కూర్చునేవాడిని. అదొక సరదా. మా ఇంటికి  చాల మంది బ్రాహ్మణులు అందులో చాల మంది పురోహితులు వచ్చేవారు. వాళ్ళు ఆశీర్వచనం చేసి కొత్త జంధ్యం ఇచ్చేవారు. వాళ్లకి సంభావన ఇచ్చి పంపేవారు మా తాతగారు. ఈ జంధ్యాల పౌర్ణమి శ్రావణ పౌర్ణమి నాడు వస్తుంది. ఈ రోజు జీర్ణమైన పాత జంధ్యం విసర్జించి కొత్త జంధ్యం (యజ్ఞోపవీతం) మార్చుకుంటారు. అయితే ప్రవాసంలో ఈ పర్వ దినం జరుపుకోవడానికి కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. అయినా వీలైనంతలో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. నాకు ఈ విషయం లో పరిజ్ఞానం తక్కువ. కాని నాకు దొరికిన ఈ విధానం యొక్క సారాంశాన్ని నలుగురితో పంచుకోవాలని నా బ్లాగు లో వ్రాస్తున్నాను. తప్పులు వుంటే చదువరులు క్షమించగలరు. ముఖ్యంగా ఈ విధానం అమెరికాలో ఉన్నవారికి వెదుక్కోకుండా వెంటనే చూసుకోవడానికి ఉపయోగ పడుతుందని నా ఆశ.

ప్రార్థన:
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం | 
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ||

గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణుః గురు దేవో మహేశ్వరః |  
గురుస్సాక్షాత్ పరభ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః || 
అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాం గతో పివా | 
యః స్మరేత్ పుండరీకాక్షం న బాహ్యాభ్యంతరశ్శుచిః ||
(ఈ మంత్రమును అనుకొనుచు శిరస్సు పై నీళ్ళు చల్లుకొనవలెను)

ఆచమనము:
ఓం మహా గణాధిపతయే నమః
ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా
(అని ముమ్మారు ఆచమనము చేయవలెను. తదుపరి చేయి కడుగుకొనవలెను.)
"గోవిందా, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, హృషీకేశ, పద్మనాభ, దామోదర, సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, పురుషోత్తమ, అధోక్షజా, నారసింహ, అచ్యుత, జనార్ధన, ఉపేంద్ర, హరే శ్రీ కృష్ణాయ నమః " (అని నమస్కరించవలెను.)
అటు పిమ్మట:
ఉత్తిష్టంతు భూత పిశాచా ఏతే భూమి భారకా ఏతేషా మవిరోధేన బ్రహ్మ కర్మ సమారభే
(చేతిలో ఉద్ధరిణి తో, లేకపొతే చెంచాతో నీరు పోసుకుని యీ మంత్రమును చదివిన పిమ్మట భూమి పై నీళ్ళు జల్లవలెను.)
ఓం భూః, ఓం భువః, ఓ గమ్ సువః, ఓం మహః,
ఓం జనః, ఓం తపః, ఓ గమ్ సత్యం, ఓం తత్స వితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్
ఓం ఆపో జ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్
*గృహస్తులు ఐదు వ్రేళ్ళతో నాసికాగ్రమును పట్టుకుని మంత్రమును చెప్పవలెను. బ్రహ్మచారులు బొటన వ్రేలి తో కుడి ముక్కును, అనామిక కనిష్టిక వ్రేళ్ళతో ఎడమ ముక్కును పట్టుకుని మంత్రము చెప్ప వలెను.  

సంకల్పం: కుండలీకరణము లో ఇచ్చినది అమెరికాలో ఉన్న వారికి వర్తిస్తుంది.
శుభే, శోభన ముహూర్తే శ్రీ మహా విష్ణో రాజ్ఞయా, ప్రవర్త మానస్య, అద్య బ్రాహ్మనః, ద్వితీయ పరార్థే, శ్వేత వరాహ కల్పే, వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమ పాదే, జంబూ ద్వీపే (ఇండియాకు) లేదా క్రౌంచ ద్వీపే (అమెరికాకు), భరత వర్షే (ఇండియా) లేదా రమణక వర్షే (అమెరికా), భరత ఖండే (ఇండియాకు) లేదా ఇంద్ర ఖండే (ఉత్తర అమెరికాకు), ...... నగరే (ఉన్న పట్టణం), స్వగృహే (స్వంత ఇంట్లో) / లేదా ..... నదీ తీరే (నది ఒడ్డున చేసుకుంటే), /లేదా .......క్షేత్రే (కోవెలలో చేసుకుంటే), అస్మిన్ వర్తమాన వ్యవహారిక, చంద్ర మానేన, వర్ష ఋతౌ, శ్రావణ మాసే, శుక్ల పక్షే, పౌర్ణమి తిథే, స్థిర (శని) వాసరే, శుభ నక్షత్రే, శుభ యోగే, శుభ కరణే, ఏవం గుణ విశేషణ విశిష్టాయాం, శ్రీమాన్ ...........గోత్రస్య (గోత్రము), .......నామ దేయస్య (పేరు), శ్రీమతః (భార్య) .....గోత్రస్య, ........నామధేయస్య (పేరు), ధర్మ పత్నీ సమేతస్య, మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, ధర్మార్ధ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థం, నూతన యజ్ఞోపవీత ధారణం కరిష్యే.

(బ్రహ్మచారులు "శ్రీ మతః .....గోత్రస్య, .......నామధేయస్య ధర్మ పత్నీ సమేతస్య" చెప్పనఖ్ఖర లేదు)
యజ్ఞోపవీతము యొక్క ఐదు ముడుల వద్దను, మరి రెండు సమానదూర స్థలము వద్దను, కుంకుమను తడి చేసి అలంకరించి ఉంచుకొనవలెను.  తదుపరి ఆచమనము చేసి యజ్ఞోపవీత ధారణా మంత్రము

"యజ్ఞోపవీతం పరమం పవిత్రం
ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్
ఆయుష్య మగ్ర్యం ప్రతిముంచ శుభ్రం
యజ్ఞోపవీతం బలమస్తు తేజః
అని చెప్పుచు, ఒక పోగు "నిత్య కర్మానుష్టాన ఫల సిధ్యర్థం ప్రథమ యజ్ఞోపవీత ధారణం కరిష్యే" అని ధరించవలెను.  
మరల ఆచమనం చేసి పై మంత్రమును పఠిస్తూ, రెండు పోగులను "గృహస్తాశ్రమ ఫల సిద్ద్యర్థం ద్వితీయ యజ్ఞోపవీత ధారణం కరిష్యే" అని జంటగా ధరించవలెను.  
తిరిగి ఆచమనం చేసి పై మంత్రమును పఠిస్తూ "ఆపన్నివారణార్థం చతుర్థ, పంచమ యజ్ఞోపవీత ధారణం కరిష్యే" అని నాలుగు, ఐదు ముడులను ఒక దాని తరువాత మరి యొకటి దరించవలెను. 
మొత్తము ఐదు ముడులు వచ్చునట్లు సరిచేసుకొనవలెను. 

తదుపరి పాత, క్రొత్త జంధ్యములను కలిపి కుడి చేతి బొటన వ్రేలు-చూపుడు వ్రేలు మధ్యన పట్టుకుని "దశ గాయత్రి" (పది మారులు గాయత్రి మంత్రమును) జపించి, యధాశక్తి "గాయత్రీ దేవతార్పణమస్తు" అని నీటిని వదలవలెను. (బ్రహ్మ చారులు ఒక్క ముడినే ధరించవలయును)
 

గాయత్రీ మంత్రము:
"ఓం భూర్భువస్సువః  తత్ సవితుర్ వరేణ్యం 
భర్గో దేవస్య ధీ మహి ధియో యోనః ప్రచోదయాత్"

తదుపరి ఈ క్రింది విసర్జన మంత్రము చదువుతూ పాత జందెమును తీసి వేయవలెను. 


"ఉపవీతం ఛిన్నతంతుం జీర్ణ కర్మల దూషితం 
 విసృజామి యశో బ్రహ్మ వర్చో దీర్ఘాయురస్తు మే"

తిరిగి ఆచమనం చేసి నూతన యజ్ఞోపవీతము తో కనీసం పది సారులైనను గాయత్రి మంత్రము జపించి యధాశక్తి "గాయత్రీ దేవతార్పణమస్తు" అని నీరు విడువ వలెను. తరువాత గాయత్రీ దేవత నుద్దేశించి నైవేద్యము సమర్పించి, ఆ ప్రసాదమునకు నమస్కరించి స్వీకరించ వలెను.

10, ఆగస్టు 2011, బుధవారం

యద్యదాచరతి శ్రేష్ఠః: తాత్పర్యం

యద్యదాచరతి శ్రేష్ఠః తత్త దేవేతరో జనః 
స యత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే

పద విచ్చేదన: యత్ + యత్ + ఆచరతి + శ్రేష్ఠః + తత్ + తత్ + ఏవ + ఇతరః + జనః + స + యత్ + ప్రమాణః +కురుతే + లోకః + తత్ + అనువర్తతే

ప్రతి పదార్ధము
త్ = ఏది; త్ = ఏది; యద్యత్ = ఏవేవి;  ఆచరతి = ఆచరించునో; శ్రేష్ఠః  = శ్రేష్టుడు, ఉత్తముడు, ఉన్నతుడు; తత్తదేవ = తత్ + తత్ + ఏవ;  త్ = దానిని; త్ = దానిని; తత్త = ఆయా వాటిని; ఏవ = కేవలం, మాత్రము;  ఇతరః = ఇతరులైన;  జనః = జనులు; = కలసి; యత్ = ఏదైతే;  ప్రమాణం = ప్రమాణము, కొలబద్ద; కురుతే = తీసుకోనునో; లోకః = లోకము; తద్ = ఆవిధంగా; అనువర్తతే = అనుసరించును.

తాత్పర్యం: ఉత్తములు ఏయే వాటిని ఆచరింతురో ఆయావాటిని మాత్రమే ఇతర జనులు ప్రమాణముగా తీసుకుందురు. లోకము కూడా ఆ విధముగా అనుసరించును.

  

3, ఆగస్టు 2011, బుధవారం

ప్రయాణాలు చేసే ముందు చదవవలసిన శ్లోకం


సంజయుడు ధృతరాష్ట్రుని యొక్క రథ సారధి మరియు సలహాదారుడు. అతనికి వ్యాస మహర్షి ఇచ్చిన వరం వలన దూరంగా జరిగే సంఘటనలను దగ్గరగా చూడగల శక్తి (ఒక విధంగా 'దివ్య దృష్టి' లేదా 'దూర దృష్టి') ఉంది. అతడు కురుక్షేత్రం లో జరుగుతున్న సంగ్రామమును, కృష్ణార్జునుల మధ్య "భగవద్గీత" రూపంలో జరిగిన సంభాషణను అంధుడైన ధృత రాష్ట్రునకు కళ్ళకు కట్టినట్లు చెప్పసాగాడు. కురు పితామహుడైన భీష్ముడు ధర్మ సందేహ నివృత్తికోసం సమీపించిన ధర్మ రాజుకు సమాధానాన్ని "విష్ణు సహస్రనామం" రూపం లో వివరిస్తాడు.ఈ స్తోత్రంలోని ఫలశ్రుతి లో సంజయుడు కృష్ణార్జునుల గొప్పతనాన్ని ఈ శ్లోక రూపంలో వివరిస్తాడు. 
        మా అమ్మ నా చిన్నప్పటి నుంచి నేను ఎక్కడకైనా దూర ప్రయాణం అవుతూ ఉంటే ఎప్పుడూ ఈ శ్లోకం గుర్తు చేసేది. ఒక సారి అమెరికా వచ్చినపుడు నాకు ఒక కాయితం మీద ఈ శ్లోకం వ్రాసి ఇచ్చింది. "ఎక్కడకైనా వెళ్ళే ముందు ఈ శ్లోకం చదువుకోరా, శుభం కలుగుతుంది" అని చెప్పింది మా అమ్మ.

సంజయ ఉవాచ:
యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః 
తత్ర శ్రీర్విజయో భూతిః ధృవా నీతిర్మతిర్మమ

ప్రతి పదార్థము
యత్ర = ఎక్కడ; యోగేశ్వరః = యోగులకే యోగియైన, యోగేశ్వరుడైన; కృష్ణః = కృష్ణుడు; యత్ర = ఎక్కడ; పార్థో = పార్థుడు / అర్జునుడు; ధనుర్ధరః = ధనుర్దారియైన; తత్ర = అక్కడ; శ్రీ = సిరి; విజయః = విజయము; భూతిః = ఐశ్వర్యము; నీతిః = నీతియును; మతిః = అభిప్రాయము; ధృవా = స్థిరముగా; మమ = నా యొక్క.

తాత్పర్యము:  సంజయుని పలుకులు: "ఎక్కడ యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు, ఎక్కడ ధనుర్దారియైన అర్జునుడు ఉందురో, అక్కడ సిరి, విజయము, ఐశ్వర్యము, నీతి స్థిరముగా ఉండునని నా యొక్క అభిప్రాయము" అని సంజయుడు చెప్పెను.